పంత్ మళ్ళీ రిపీట్ చేస్తే కఠిన నిర్ణయాలు తప్పవు: రవిశాస్త్రి
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ మ్యాచ్ లో తొలి బంతికే రిషబ్ పంత్ ఒటైన సంగతి తెలిసిందే. అలాంటి చెత్త షాట్ మళ్ళీ రిపీట్ అయితే మా నిర్ణయాలు కఠినంగా ఉంటాయని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం మలమైన జట్టుని రూపొంధించే క్రమంలో జట్టు మేనేజ్ మెంట్ రిషబ్ పంత్ కి పదే పదే అవకాశాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రిషబ్ పంత్ వాటిని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నాడు.
ఇటీవలే వెస్టిండిస్తో ముగిసిన సిరిస్లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు. అంతేకాదు ఎప్పుడూ ఒకే తరహా షాట్కు ఔట్ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో పంత్ షాట్ సెలక్షన్పై మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ను తప్పించి మరో యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు గొంతెత్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్యూలో రవిశాస్త్రి… పంత్ ఆటను మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవంటూ హెచ్చరించాడు.