పవన్ కల్యాణ్ పింక్ రిమేక్ తో రీ ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రిమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. పింక్ రీమేక్ విడుదలపై స్పష్టత వచ్చింది.ఈ సినిమాను మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే మే 11న గబ్బర్ సింగ్ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పింక్ రిమేక్ ని మే నెలలోనే తీసుకురావాలనే ప్లాన్ దిల్ రాజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఉగాది సందర్భంగా టైటిల్ ను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇక పింక్ రిమేక్ తో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే.