తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ బస్ చార్జీలు
తెలంగాణలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన బస్ చార్జీలు అమలు కానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కనీస చార్జీ రూ.5 నుంచి రూ.10కి ఆర్టీసీ పెంచింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.15, డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీ రూ.20కి పెంచింది. సూపర్ లగ్జరీలో కనీస చార్జీని రూ.25కి… రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్లో రూ.35 కనీస చార్జీ పెంచగా.. వెన్నెల ఏసీ స్లీపర్లో కనీస చార్జీ ఆర్టీసీ రూ. 75 చేసింది. సిటీ ఆర్డీనరీ బస్పాస్ చార్జీ రూ. 770 నుంచి రూ.950కి పెంచగా.. మెట్రో బస్ పాస్ రూ. 880 నుంచి రూ.1,070కి ఆర్టీసీ పెంచింది. మెట్రో డీలక్స్ బస్పాస్ చార్జీ రూ.990 నుంచి రూ.1180కి పెంచగా.. స్టూడెంట్ బస్పాస్ రూ.390 నుంచి రూ.495కి పెంచింది.