భారత క్రికెట్ లెజెండ్ సచిన్ కు అరుదైన గౌరవం

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ కి  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ఆఫ్ ఫేమ్ లో స్థానం లభించింది. ఐసీసీ ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించింది. లండన్ లో నిర్వహించిన ఐసీసీ హల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ ‘తనకు లభించిన ఈ గుర్తింపు పట్ల సంతోషంగా ఉందని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తాను’ అని చెప్పారు.

అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులతో పాటు వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్ అని ఐసీసీ కొనియాడింది. లెజెండ్‌ అనే పదం సచిన్‌కి తక్కువే.. తాజాగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఆయనకి స్థానం కల్పించాం’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది.  సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌ , ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లకు ఈ అవకాశం లభించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *