సాహో రిలీజ్ న్యూ పోస్టర్

ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహో’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయ్యింది. యంగ్ రెబల్‌ స్టార్  హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్ సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాకావటంతో సాహో పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా  రూ.150 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది యూవీ క్రియేషన్స్‌ సంస్థ. పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ ఒక్కటి కూడా విడుదల కాలేదు. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తైంది.

జిబ్రాన్‌ సంగీతం అందించారు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. భారతీయ తొలి భారీ యాక్షన్‌ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల 30కి వాయిదా పడింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *