సాహో…కలిసుంటే నీతో ఇలా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ అడ్వంచర్ సాహో సినిమాలో మరో పాటను దర్శకుడు సుజీత్ ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ‘కలిసుంటే నీతో ఇలా.. కలలాగే సాగిందిగా..’ అంటూ సాగే మెలోడి పాటను ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సాహో సినిమాలో నా ఫేవరేట్ సాంగ్ అంటూ ట్వీట్ చేశారు. శంకర్-ఎహసాన్-లాయ్ కంపోజ్ చేసిన ఈ పాటకు కేకే లిరిక్స్ అందించారు. ఈ పాట విడుదలను తెలియచేస్తూ ఈ రోజు ప్రభాస్ సాహో ప్రపంచాన్ని చూడడానికి రెడీగా ఉండండి అని పోస్ట్ చేశారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ తార శ్రద్ధాకపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.