Sai Dharam Tej యాక్సిడెంట్ విషయం ఫస్ట్ తెలిసింది బన్నీకే..
సాయిధరమ్తేజ్కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం మొదట బన్నీ (అల్లుఅర్జున్)కే తెలిసింది. తేజ్ను మొదట మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న స్నేహితుల ద్వారా బన్నీకి సమాచారం అందింది. ఆ సమయంలో బన్నీ కాకినాడలో పుష్ప షూటింగ్లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మెడికవర్లో ఉన్న స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు సాయిధరమ్ ఆరోగ్యం గురించి బన్నీ వాకబు చేశారు.