తెలంగాణ వంటకాలంటే ఇష్టం: సమంత

అబద్దానికి రుచి ఎక్కువ. నిజాలు చేదుగా ఉంటాయి. కానీ నాకైతే నిజం మాట్లాడడమే ఇష్టం అంటోంది సమంత. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో సినీ నటుడు నితిన్‌, డిజైనర్‌ నీరజ కోన సంయుక్తంగా ఏర్పాటుచేసిన టీ-గ్రిల్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత..తనకు తెలంగాణ వంటకాలంటే ఇష్టమని తెలిపింది.తనకు వంట చేయడం రాదు కానీ వంటకాల రుచి చూసి బాగుందో లేదో సరిగ్గా జడ్జ్‌ చేయడం మాత్రం వచ్చన్నారు.బిర్యానీ రుచులను ఎప్పటికీ మరిచిపోనని తెలిపింది సమంత.

కొన్ని కొన్ని సార్లు పత్రికల్లో నా గురించి రాసిన ఏవేవో వార్తలు కనిపిస్తుంటాయి. వాటిని పట్టించుకోకూడదని ఎంత అనుకొన్నా… కుదరడం లేదు. అందుకే కొంతకాలం వాటికి దూరంగా ఉన్నా. ఇప్పుడు ఆ రాతలేం నన్ను ప్రభావితం చేయవు. అందులో నిజాలు ఉంటే అందరికంటే నేనే ఎక్కువ సంతోషిస్తా. నిజాలు కాస్త కఠినంగా ఉండొచ్చు. తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వకపోవొచ్చు. కానీ వాటికే విలువ ఉంది. అబద్దాలు ఎప్పుడూ అబద్దాలుగానే మిగిలిపోతాయి. వాటిని జనం కూడా తొందరగా మర్చిపోతారు. అందుకే నిజాలే మాట్లాడుకొందామని తెలిపింది.

తెలుగులో ప్రస్తుతానికి సినిమాలేవీ కమిట్‌ కాలేదంటూ తమిళంలో మూడు చిత్రాలు చేస్తున్నానన్నారు. పెళ్లి గురించి అడగ్గానే ఇంకా అడగలేదేమిటా అని చూస్తున్నాను.. త్వరలోనే మీ అందరికీ చెబుతా.. ఈ రెస్టారెంట్‌లోనే రిసెప్షనూ పెడతా అంటూ నవ్వేశారు.ఈ కార్యక్రమంలో నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *