సంపూర్ణేష్ కారు ను ఆర్టీసీబస్సు ఢీ
సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం (నవంబర్ . 27) ఉదయం 11.30 గంటల సమయంలో సంపూర్ణేశ్ బాబు తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబు కారు స్వల్పంగా ధ్వంసమైంది . ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి వచ్చి సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు సాయం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో మంగళవారం ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపించడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.