సత్యాగ్రహ దీక్ష ఆయేషామీరా తల్లిదండ్రులు

2007లో దారుణ హత్యకు గురైన బీ ఫార్మసీ ఆయేషా మీరా తల్లిదండ్రులు దీక్షకు సిద్ధమయ్యారు. తన కూతురి హత్యకేసులో న్యాయం చేయాలంటూ ఈనెల 27న తెనాలి గాంధీచౌక్‌లో సత్యాగ్రహ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన. 2007 డిసెంబర్ 27న  జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ దీక్ష చేస్తున్నారు. ఆయేషా తల్లిదండ్రులకు మహిళా సంఘాలతో పాటూ పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మద్దతు తెలపాలని నిర్ణయించాయి. ఆయేషా హత్య జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా నిందితులు ఎవరో పట్టుకోలేకపోయారని తండ్రి ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదన్నారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని.. ఇలాంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకు ఎదురు కాకూడదనే నినాదంతోనే తాము దీక్షకు సిద్ధమయ్యామంటున్నారు.
2007 డిసెంబర్‌లో బీ ఫార్మసీ చదవుతున్న ఆయేషా మీరాను విజయవాడలో ఆమె ఉంటున్న హాస్టల్‌లోనే దారుణంగా హత్య చేశారు. డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సత్యంబాబు అనే యువకుడ్ని అరెస్ట్ చేయగా, తర్వాత అతడు నిర్థోషని తేలడంతో విడుదలయ్యాడు.తర్వాత ఈ హత్యకేసుపై విచారణ జరిపించాలని ఆయేషా తల్లితో పాటు పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. అయేషా మీరా కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. కీలక సాక్ష్యాధారాలు, రికార్డులు లేవని కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐతో విచారణ జరిపించాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ మళ్లీ కేసు నమోదు చేసింది. ఏపీ పోలీసుల నుంచి కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించింది. కేసు విచారణలో దూకుడు పెంచింది. తాజాగా పోస్ట్‌మార్టమ్ నిర్వహించి.. కొన్ని కీలక అవశేషాలను సేకరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *