40 కోట్లు..అప్పుడే…
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్తా వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే రూ.40 కోట్లు రాబట్టినట్టు సమాచారం. విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కుల్ని ఇంత మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. టిజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ చక్కగా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్రా యూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో చిరంజీవి కథానాయకుడు. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2నా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. నయనతార, తమ్మన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు చేస్తున్నారు.