తెలంగాణకు కొత్త గవర్నర్ గా శంకర్ మూర్తి?
నరసింహన్ కేంద్రానికి వెళ్లబోతున్నారని… ఆయన స్థానంలో కేంద్రం కొత్త గవర్నర్ను నియమించనుందని వినిపిస్తోంది. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే నరసింహన్ కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.వర్నర్ పదవీకాలం మేలోనే ముగిసింది. అయితే కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఉప రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు కూడా వినిపించింది.
అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు బరిలో దిగడంతో నరసింహన్ కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. నరసింహన్ కు గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన అనుభవం ఉండడంతో అందులోనే ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.
నరసింహన్ ఖాళీ చేస్తే ఏపీ తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని కూడా హోంశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు శంకర్ మూర్తిని తెలంగాణకు గవర్నర్ గా నియమిస్తారని వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ బేడీని గవర్నరుగా నియమించవచ్చని సమాచారం.