పసుపులేటి రామారావు గారు పోతే శివాజీ రాజా మాట్లాడుతూ..

పసుపులేటి రామారావు గారు పోతే సినీ ప్రముఖులు ఏర్పాటు చేసిన సంతాప సభలో శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరిపై ఫైర్ అయ్యాడు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఆయన సినీ పరిశ్రమకు సేవ చేస్తూనే ఉన్నాడని, ఆయన రాసిన రాతల వల్లే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. ఆ మధ్య ఆయన మోకాళుకు చికిత్స చేయిస్తానంటే.. చిరంజీవి గారు చేయిస్తారని అన్నట్లు ఆయన తెలిపాడని.. శివాజీ రాజ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.పసుపులేటి రామారావు గారు పోతే.. ఎంతో మంది స్పందించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని కొందరు (పవన్ కళ్యాణ్), మా కుటుంబంలోని వ్యక్తి అని మరికొందరు సంతాపాన్ని వ్యక్తం చేశారు.. మరి వారంతా ఎక్కడికి పోయారు.. ఇక్కడ లేరే? అంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఈ పదాలు వాడాలని వాడేస్తుంటారంటూ చురకలంటించాడు.తనకు ఇలాగే మాట్లడటం వచ్చు.. ఇలాగే మాట్లాడతానంటూ.. మీడియాపైనా ఫైర్ అయ్యాడు. తనకు అబద్దాలు చెప్పే అలవాటు లేదని అంటూ.. నటీనటుల మధ్య బేధాభిప్రాయాలున్నాయి ఓకే.. మీడియాలోనూ ఉన్నాయి.. అలాంటి వ్యక్తిని ఇలానా పంపించేదంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఎంతో కొంత కలెక్ట్ చేసి ఇవ్వడం తనకు అలవాటని, అదే విధంగా ఆయన కుటుంబానికి కూడా ఓ ఐదు లక్షలు అందిస్తానని, అదే తాను చేయగలిగిన సహాయమని పేర్కొన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *