సారీ బ్రదర్ ఇలాంటి వాటిని సమర్ధించను..k.t.r.

అభిమానుల అభిమానానికి అంతే ఉండదు, తమ అభిమాన నేతను  .. ఇలా ఎవరికైనా తమ అభిమానాన్ని వారు విపరీతంగా చూపిస్తుంటారు. తాజాగా అలాంటి అభిమాని ఒకరు తన అభిమానాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చూపించారు. జెల్లు శ్రీను అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు వీరాభిమాని. ఆయన తన అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా కేటీఆర్ ఫోటోను వీపుపై టాటూ వేయించుకున్నాడు.  యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటూ రాయించుకున్నాడు. జై రామన్న అంటూ ఓ నినాదాన్ని కూడా టాట్టూగా వేయించుకున్నాడు.  ఈ టాట్టూను ఫోటో తీయించి .. ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్. . ఆ  అభిమాని అభిమానాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది నిజమేనా..!! సారీ బ్రదర్ నేను ఇలాంటి వాటిని సమర్ధించను.. అనుమతించనని ఖరాఖండీగా చెప్పేశారు. ఇది అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని ట్వీట్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *