అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం

srideviఅతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఏడాదిన్నర కాలమవుతున్న ఇంకా సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా ఈ దివంగత నటికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు.. ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 4న సింగపూర్‌లో మేడమ్ టుస్సాడ్స మ్యూజియం లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *