నిండు కుండలా శ్రీశైలం డ్యామ్
ఈ వర్షాకాలం కాస్త లేటుగా రుతుపవనాలు వచ్చిన, కర్ణాటక మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని డ్యామ్ లు నీటితో కళకళ లాడుతున్నాయి. తుంగభద్ర మరియు కృష్ణ నది రెండు కూడా ఉదృతంగా ప్రవహిస్తుండంతో శ్రీశైలం డ్యామ్ నిండు కుండలా మారింది. పై నుంచి వరద ఇంకా కొనసాగుతుండడంతో, అన్ని గేట్లు ఓపెన్ చేసి నీటిని నాగార్జున సాగర్ కి వదులుతున్నారు. అన్ని గేట్లు ఒక్కసారిగా తెరుచుకునే సరికి, ఆ దృశ్యం చూడటానికి అద్భుతుంగా ఉంది, ఇటు హైదరాబాద్ నుంచి అటు ఆంధ్రా నుంచి జనాలు వేలాదిగా వచ్చి ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనంద పడుతున్నారు. కాకపోతే, వచ్చిన వాహనాల్ని ట్రాఫిక్ జాం అవ్వకుండా నియంత్రించాడానికి పోలీసులకే తల నొప్పిగా మారింది. సో, ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీకెండ్ విసిట్ ప్లాన్ చేసుకోండి.