ఉద్ధవ్ ఠాక్రే పార్కులో ప్రమాణ స్వీకారం
షాద్మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ అఘాడీ’ అభ్యర్థి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం 6.40 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఉద్ధవ్ ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 1966లో మొదటిసారిగా ఇక్కడే బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా శివసేన పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రిగా మనోహర్ జోషీ కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే కూడా శివాజీ పార్కులోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి