దర్శకుడు సారీ చెప్పాల్సిందే – తమన్నా

మిల్కీ బ్యూటి తమన్నా బాటియా కొత్త సినిమా ”ఒక్కొడొచ్చాడు” ధియేటర్లలో ఆడట్లేదు కాని.. ఆ సినిమా గురించి రకరకాలు ఇష్యూలు మాత్రం మీడియాలో రచ్చ లేపేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆ సినిమా దర్శకుడు సూరజ్ పై హీరోయిన్లు అందరూ ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ హీరోయిన్ నయనతార కూడా ఈ విషయంలో సూరజ్ సారీ చెప్పాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు మిల్కీ కూడా స్పందించింది.

కాస్త లేటైనా కూడా.. అక్కడ హీరోయిన్ గా చేసింది తనే అయినా కూడా.. తమన్నా బాగానే స్పందించింది. ”దంగల్ సినిమా చూస్తూ దియేటర్లో నుండి ఈ కామెంట్లు గురించి తెలుసుకుని బయటకు వచ్చేశాను. సూరజ్ మాటలు బాధను కలిగించాయి. కోపం తెప్పించాయి. నాకే కాదు.. మొత్తంగా సినిమాల్లో ఉన్న అమ్మాయిలందరికీ కలిపి సూరజ్ క్షమాపణలు తెలపాల్సిందే. ఇక్కడకు నటించడానికి వచ్చాం తప్పితే.. వేరే వాటికి కాదు. ఆటవస్తువులుగా చిత్రీకరిస్తే ఊరుకునేదే లేదు. ఈ 11 సంవత్సరాల కెరియర్లో నాకు నచ్చిన బట్టలను.. నాకు నప్పే బట్టలనే వేసుకున్నాను. అలాగే సూరజ్ మాటలను తీసుకుని ఇండస్ర్టీ అంతా అలాగే ఉంటుందని అనుకోవద్దు” అంటూ తమన్నా స్టేట్మెంట్ ఇచ్చింది.

అయితే తమన్నా కంటే ముందే ఈ యవ్వారం ఎప్పుడూ మీడియా ముందుకు రాని నయనతార స్పందించడం.. అలాగే ఈ కామెంట్లన్నీ ఎలా ఉన్నా కూడా అసలు తమన్నా తన సినిమాల్లో విపరీతమైన ఎక్సపోజింగ్ చేయడం దారుణం.. అంటూ ఇప్పుడు తమిళ మీడియా ఆమెను ఏకేస్తోంది. ఈ కామెంట్స్ సంగతేమో కాని.. ”ఒక్కడొచ్చాడు” సినిమాకు మాత్రం ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ అవుతోంది. కాదంటారా?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *