తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుంచి ఢీల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో గురువారం ఉదయం 7.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్గఢ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనలో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. పొగలు రావడానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.