8నా రైల్వే స్టేషన్లను పేల్చేస్తామంటున్న ఉగ్రసంస్థలు
రైల్వే స్టేషన్లను పేల్చేస్తామంటున్న ఉగ్రసంస్థ జైష్ మహ్మద్. దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఒక లేఖలో పేర్కొన్నారు. అక్టోబల్ 8నా రోహ్ తాక్, ముంబయి, బెంగళూరు, చెన్నై, జైపుర, భోపాల్, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చేస్తామని మసూద్ అహ్మద్ అనే పేరిట రాసిన లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్తాన్, జైపూర్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది. ఈ మేరకు జైషే రాసిన లేఖ… రోహతక్ రైల్వే జంక్షన్ సూపరిండెంటెండ్ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోస్టు ద్వారా చేరుకుంది. తమ ముఠా సభ్యులా ఎన్ కౌంటర్లకు ప్రతికరం తీర్చుకుంటామని మసూద్ అనే వ్యక్తి సంతకం చేసిన సదరి హింది లేఖ శనివారం అందింది.