దిశా ఘటనపై కేసీఆర్పై మండి పడిన నేషనల్ మీడియా
ఢిల్లీలో సీఎం కేసీఆర్కు ఎప్పుడూ లేని విధంగా విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ప్రధాని, కేంద్రమంత్రులతో కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలతో పాటు ఓ నాయకుడి ఇంట పెళ్లికి కూడా హాజరయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారు. అయితే కేసీఆర్పై నేషనల్ మీడియా
మండిపడుతోంది. దిశా హత్యాచార ఘటనపై సీఎం స్పందించిన తీరుపై ఇప్పటికే పలు ఆరోపణలు వినిపించాయి. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించడాన్ని నేషనల్ మీడియా మండిపడింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్కు ఇదే విషయమై నేషనల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఢిల్లీలో పెళ్లికి వచ్చిన మీకు దిశా ఇంటికి పరామర్శకు వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. దీంతో మీడియా అడిగిన ప్రశ్నలకు ఖంగు తిన్న కేసీఆర్ అక్కడ నుంచ ఏమాట్లాడకుండానే సైలెంట్గా వెళ్లిపోయారు. తెలంగాణలో దిశా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశరాజధాని ఢిల్లీలో సైతం నిరసనలు మిన్నంటాయి. నేషనల్ మీడియా సైతం దీనిపై గళమెత్తింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ ఘటనపై చర్చించారు. దిశ కుటుంబానికి న్యాయం జరగాలని పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడారు.
సీఎం కేసీఆర్పై ఏబీవీపీ నేతలు మండిపడ్డారు….
శంషాబాద్లో సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ఏ.బి.వి.పి హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించింది. ‘జస్టిస్ ఫర్ దిశ’ పేరుతో చేపట్టిన ఈ ర్యాలీకి విద్యార్థులు భారీగా హాజరయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సోమవారం (డిసెంబర్ 2) మధ్యాహ్నం ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఆలస్యం చేయకుండా రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిశకు న్యాయం జరిగేవరకూ తమ ఉద్యమం ఆగదని ఏబీవీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ ఘటనపై తెలంగాణ హోం మంత్రి స్పందించిన తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు తన సోదరికి కాకుండా పోలీసులకు ఫోన్ చేయాల్సిందని ఆయన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఫిర్యాదు ఇవ్వబోతే తమ పరిధిలోకి రాదని చెప్పడాన్ని బట్టే పోలీసులు ఎలా పని చేస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్పై ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి పేరు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని, వెంటనే ఆయన తన పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఉద్యమం మహిళల చేతిలోకి వెళ్లిందని న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.