బాల కార్మికులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు
హైదరాబాద్: ఎల్బీ నగర్లో బాల కార్మికుల అక్రమ రవాణా ముఠాని రాష్ట్ర బచ్పన్ బచావో కమిటీ, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్కు బాల కార్మికులను ముఠా తరలిస్తున్నారని ఛత్తీస్ఘడ్ బచ్పన్ బచావో కమిటీ ఇచ్చిన సమాచారంతో ఎల్బీ నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బాల కార్మికులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని.. అందులో ఉన్న 20 మంది బాల కార్మికులని అదుపులోకి తీసుకుని మేనేజర్ని అరెస్ట్ చేశారు.