చనిపోయిన ఆమె తిరిగి బ్రతికింధి
పాకిస్తాన్ లోని కరాచీలో 50 ఏళ్ల రషీదా బీబీ అనే మహిళను అబ్బాసీ షాహిద్ అనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు మరణించినట్టు చెప్పారు. అనంతరం మరణ దృవీకరణ పత్రం కూడా ఇచ్చారు. మరణించిన మహిళను ఇంటికి తీసుకొచ్చి గదిలో ఉంచి, వారి సంప్రదాయం ప్రకారం తలపై చల్లని నీళ్లు పోశారు. అంతే అందరూ షాక్ అయ్యారు. ఆ మహిళా చేతి వేళ్ళు కదలడం ప్రారంభించాయి. కాసేపటికి శ్వాస కూడా తీసుకోవడం మొదలుపెట్టింది. నాడి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అంతే అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆ మహిళను మరలా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్య చరిత్రలోనే ఇది అరుదైన సంఘటనగా వైద్యులు చెప్తున్నారు. మరణించినట్టు మరణదృవీకరణ పత్రం ఇచ్చిన వైద్యులు ఆ పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.