ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలు అంతం చేయడమే

టెహ్రాన్‌, ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడులను ప్రతీకార చర్యగా ఆ దేశ అగ్రనేత అయతుల్లా అలీ ఖమైనీ అభివర్ణించారు. బుధవారం ఆయన ఖోమ్‌లో సులేమానీకి నివాళులర్పించారు.అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు. అమెరికాకు ఈ రకమైన సైనిక చర్య ఒక్కటే సరిపోదన్నారు. పశ్చిమాసియాలో అమెరికా బలగాలు అక్రమంగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఇరాక్‌లో దాని ఉనికిని అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. మంగళవారం రాత్రి జరిపిన దాడుల్లో 80 మంది అమెరికన్‌ సైనికులు చనిపోయినట్లు ఇరాన్‌ ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా మీడియా మాత్రం అలాంటిది ఏమీ జరగలేదని తెలిపింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *