న్యాయవాదుల పోరాట పటిమ చాలా గొప్పధి

హైదరాబాద్, జనవరి 1: న్యాయవాదుల పోరాట పటిమ చాలా గొప్పదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటై ఏడాది గడచిన సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వార్షికోత్సవాలకు జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఖాళీల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైకోర్టుల్లో ఇదే పరిస్థితి ఉందని, కేసులు మాత్రం లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులకు 600 మంది మాత్రమే ఉన్నారని , ఎప్పటికపుడు న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని, 55 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, మరో 115 మంది న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు సుప్రీంకోర్టు నుండి వెళ్లనున్నాయని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు, ఇతర కారణాలతో నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *