నవాబు అలీఖాన్ ఖజానా ఒక స్ట్రాంగ్రూమ్ లో ఉంది
ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్నకు చెందిన చివరి నవాబు రాజా అలీఖాన్ కన్నుమూసిన ఐదు దశాబ్దాలు గడచిన తరువాత కూడా అతని ఆస్తి పంపకాలు ఇంకా జరుగనే లేదు. నవాబు రాజాకు చెందిన ఆస్తులను 16 మంది వారసులకు పంచాల్సివుంది. ఈ నేపధ్యంలోనే పలు కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. అలాగే ఒక ధనాగారంలోని ఖజానా ఏమేరకు ఉందనేని చూడాల్సివుంది. ఈ నవాబు కోటలో ఒక స్ట్రాంగ్ రూమ్ఉంది. దీనిని తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్లో భారీగా నిధులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. నవాబు రాజు అలీఖాన్ 1966లో కన్నుమూశారు. అనంతరం గద్దెనెక్కిన అతని పెద్ద కుమారుడు తండ్రి ఆస్తిపాస్తులను దక్కించుకున్నాడు. దీంతో రెండవ కుమారునికి ఎటువంటి సంపద దక్కలేదు. ఈ వ్యవహారం కోర్టునకు చేరింది. ఈ ఉదంతంపై అడ్వకేట్ కమిషనర్ అరుణ్ ప్రకాష్ సక్సేనా మీడియాతో మాట్లాడుతూ రామ్పూర్ చివరి నవాబు రాజా అలీ ఖాన్కు చెందిన ఆస్తుల పంపకం విషయమై అతని కుమారుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే 1972లో రామ్పూర్ జిల్లా కోర్టులో కేసు నమోదయ్యింది. తరువాత కేసు హైకోర్టుకు చేరుకుంది. హైకోర్టు ఈ సూట్ను డిస్మిస్ చేసింది. దీంతో నవాబ్ అలీ ఆస్తంతా అతని పెద్ద కుమారుడు ముర్త్జా అలీకి చెందినట్లయ్యింది. ఈ నేపధ్యంలో న్యాయం కోసం నవాబ్ అలీ సోదరుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో 2019 జూలై 31న సుప్రీం కోర్టు తన తీర్పు వెలువరించింది. దీని ప్రకారం 1950 తరువాత నవాబులు ఎవరూ లేరని, చివరి నవాబు, దివంగత అలీఖాన్ అవుతారని పేర్కొంది. ఫలితంగా ముస్లిం పర్సనల్ లా, షియా పర్సనల్ లా ప్రకారం ఈ ఆస్తిపాస్తులు వారసులందరికీ చెందాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇది నవాబ్ అలీ పెద్ద కుమారునికి ఎదుదెబ్బలా మారింది. అలాగే ఈ ఆస్తిపాస్తులను నవాబు అలీ వారసులైన 16 మందికి వాటాలు వేయాల్సివుంది. ఇదిలా ఉండగా బంగళాలో ఒక స్ట్రాంగ్రూమ్ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున నిధులు, అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్నకు చెందిన తాళం ఎవరి దగ్గరా లేదు. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఈ స్ట్రాంగ్ రూమ్ను తెరవాల్సివుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ లాకర్ను లండన్కు చెందిన ఒక కంపెనీ రూపొందించింది. ఆ కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం ఈ లాకర్ను బాంబులతో పేల్చినా అది తెరుచుకోదు. అయినప్పటికీ దానిని తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ లాకర్కు నలువైపులా లోహపు తలుపులు ఉన్నాయి. ఈ తలుపులు తెరుచుకుంటే అమూల్యమైన సంపద బయటపడుతుందని చెబుతున్నారు.