వ్యాపారాలకు ఉపయోగించే సిలిండర్ ధర పెరిగింది
Feb 1, 2020 ఈ రోజు నుంచే శనివారం ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ ధర భారీగానే పెరిగి, ధర పెంపు అమలులోకి వచ్చింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ.225 బడ్జెట్ ముందు గ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. తాజా ధర పెరుగుదల నేపథ్యంలో ఇప్పుడు సిలిండర్ ధర రూ.1,550కు చేరింది. అమలులోకి వచ్చింది. రిటైల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కొంత మేర ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధర గత ఐదు నెలలుగా పెరుగులూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం.. ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.714కు చేరింది. ఢిల్లీలో ఈ ధర వర్తిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్కతాలో రూ.747కు, ముంబైలో రూ.684కు, చెన్నైలో రూ.734కు పెరిగింది. ఇకపోతే దేశంలో సిలిండర్ ధర 5 నెలలుగా పెరుగుతూనే వచ్చింది. జనవరి వరకు ఇదే ట్రెండ్ నడిచింది. అక్టోబర్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలోనూ ఎల్పీజీ ధర రూ.15.5 పైకి కదిలింది. నవంబర్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.76 పెరిగింది. డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల రూ.14 మేర పైకి కదిలింది. ఫిబ్రవరిలోనూ ధర రూ.19 పెరిగింది. కాగా జూలై, ఆగస్ట్ నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా రూ.163 దిగొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది. వీటిని అదనంగా సిలిండర్ కావాలంటే మార్కెట్ ధర చెల్లించాలి. ఇకపోతే గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీ మార్కెట్లో గ్యాస్ సిలిడర్ ధర పెరిగితే అప్పుడు మోదీ సర్కార్ వినియోగదారులకు అధిక సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది. దీంతో ధర పెరిగిన ప్రభావం కనిపించదు. అయితే ఇది అందరికీ వర్తించదు. అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్పై చెల్లించే జీఎస్టీ మాత్రం ధరతో పాటు పెరుగుతుంది. మార్కెట్ ధర ప్రాతిపదికనే జీఎస్టీ నిర్ణయమౌతుంది. అందువల్ల గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే.. అప్పుడు ఎక్కువ జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.