మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ని చంపేస్తామని బెదిరింపులు
ఢిల్లీ;బీజేపీ ఎంపీ, మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ‘‘నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని, ఆయన కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తుల అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు కాల్ రావడంతో గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన శాహద్ర డీసీపీకి లేఖ రాశారు. గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు పరిణామాలపై కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయాలను వెల్లడించడం ఆయన ప్రత్యేకత.