నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన ఖరారుకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు వల్ల వచ్చిన పరిస్థితిని ఫోన్లో వివరించారు. దీంతో శుక్రవారం నాడు ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా కేసీఆర్‌కు మోదీ సూచించారు. అయితే పార్లమెంటు సమావేశాలు ఉన్నందువల్ల శనివారం ఆయన కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర్రంలో నెలకొన్న పరిస్థితులు మోదీతో చర్చించనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కంచేలా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా,,మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పెద్ద నోట్లను బ్యాన్ చేయడం వల్ల రాష్ట్ర్ర ఆదాయంపై పడిన ప్రభావం.. అందుకు తీసుకోవాల్సిన చర్యలను లిఖితపూర్వకంగా ఆయనకు అందించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ టూర్‌ ను ఖరారు చేసే ముందు సీఎం కేసీఆర్‌,,ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర్ర స్థితిగతులపై అధికారులతో మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి ప్రజలు ఉపయోగపడితీరాలని కేసీఆర్ నిర్ణయించారు. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దొహదపడగలిగితే..ప్రధానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది.

ప్రధానంగా రిజిస్ట్రేషన్, రవాణా రంగాల్లో ఆదాయం భారీగా తగ్గిందని సమీక్ష సమావేశంలో కేసీఆర్ చెప్పారు. ఎక్సైజ్, సేల్స్ టాక్స్, కమర్షియల్ టాక్స్‌పైనా ప్రభావం కనిపిస్తోందన్నారు. సామాన్యులు, చిరు వ్యాపారులు ఈ నిర్ణయం వల్ల నష్టపోకుండా చూడాలని సూచించారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గినందున కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఈ విషయాలన్నింటినీ తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *