హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్…

హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ నుండి కూకట్ పల్లి వరకు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకొనేందుకు రావడంతోపాటు, అమీర్ పేట నుండి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర సాగుతుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు ఇబ్బందులకు పడుతున్నారు. ట్రాఫిక్ ను క్రమపద్ధీకరించే క్రమంలో పోలీసులు వాహనాలను ఎస్ ఆర్ నగర్ నుండి పంజగుట్ట మీదుగా మళ్లించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *