గణేష్ నిమజ్జనం: వాహనదారులకు సూచనలు

హైదరాబాద్ లోని వినాయకుడి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది పోలీస్ శాఖ.  ఈ విషయమై ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాహనదారులకు కీలక సూచనలు చేశారు. నిమజ్జననికి వచ్చే వాహనదారులు తప్పకుండ హెల్మెట్ ధరించాలి. వాహనాలపై పరిమితికి మించి ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్ లేకుండా నిమజ్జన సమయంలో తప్పించుకున్న తర్వాత జరిమానాలు తమ ఇంటికే పంపిస్తామని చెప్పారు. ఇక గణేష్ శోభయాత్రలో బైకులకు, కార్లకు అనుమతి లేదని సృష్టం చేశారు. దానికి బదులు మెట్రో తో పాటు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను వాడుకోవాలని సూచించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *