ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

కశ్మీరు సమస్య పరిష్కారం కోసం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సోమవారం ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయిన సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే మోదీ ఈ విషయంపై తనతో చర్చించారని ట్రంప్‌ అన్యాపదేశంగా చెప్పుకొచ్చారు. కాని  ట్రంప్‌ వ్యాఖ్యల్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని.. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది.

విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ట్రంప్‌తో భేటీ సందర్భంగా మోదీ కశ్మీర్‌ మధ్యవర్తిత్వంపై ఎలాంటి చర్చ జరపలేదని తెలిపారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని అమెరికా కాంగ్రెస్ తప్పుపట్టి, క్షమాపణలు కోరింది. ఈ విషయంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నా నిపుణుల విశ్లేషణ నేపథ్యంలో అమెరికా నివరణా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *