ట్రంప్ సతీసమేతంగా భారత్లో పర్యటిన తేదీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన తేదీలను వైట్ హౌస్ అధికారికంగా ఖరారు చేసింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ సతీసమేతంగా భారత్లో పర్యటిస్తారని శ్వేత సౌధం తెలిపింది. వీరిద్దరూ న్యూఢిల్లీ, అహ్మదాబాద్ల్లో పర్యటిస్తారని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ట్రంప్ పర్యటన తోడ్పడుతుందని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భారత్లో పర్యటించనుండటం ఇదే తొలిసారి.!