తిరుపతిలో భక్తులకి షాక్ ఇచ్చిన టీటీడీ? ఇకపై అలా వెళ్తే అంతే సంగతులు!

తిరుమల తిరుపతి దేవస్థానంకి రోజు లక్షల్లో భక్తులు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కలియుగ ఆరాధ్యదైవం అయిన శ్రీవారి దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కొంత మంది కోరిన కోర్కెలు నెరవేరితే కొండ మీదని కాలిబాటన వస్తామని మొక్కుకుంటారు . దీంతో వేల సంఖ్యలో భక్తులు ప్రతి రోజు శ్రీవారి దర్శనం కోసం కాలిబాటన నడిచి వెళ్తారు. కాలిబాట నడిచి వచ్చే భక్తుల కోసం టీటీడీ దివ్యదర్శనం ఫ్రీగా అందించింది. అయితే ఇప్పుడు కాలిబాట భక్తులకి టీటీడీ బోర్డు పెద్ద షాక్ ఇచ్చింది.

ఇకపై కాలిబాట నడిచి వెళ్ళిన సాధారణ దర్శనమే చేసుకోవాలని చెప్పింది. దివ్యదర్శనం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాలిబాట దర్శనం, మూడు వందల దర్శనం ఒకే సారి నిర్వహించడంలో అధికారులు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దాంతో పాటు ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకొని దివ్యదర్శనం సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయితే ఆలయ అధికారుల ప్రకటన మీద భక్తులు కాస్తా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన నడిచి రావడానికి సుమారు రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆపై దర్శనం కోసం కూడా మరో 10 గంటలు వేచి ఉండాలని చాలా కష్టంతో కూడిన పని అని భక్తులు అంటున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *