పోలీసులకు యోగాసనాలు నేర్పించారు

అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ ఆధ్వర్యంలో పోలీసులకు యోగాసనాలు నేర్పించారు. ఈ యోగా కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా పాల్గొన్నారు.ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇవ్వడంలో అపోలో లైఫ్ వైస్ ఛైర్ పర్సన్, రామ్ చరణ్ భార్య ఉపాసన ఎప్పుడూ ముందుంటారు. ఆమె అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన బీ-పాజిటివ్ మ్యాగజైన్‌కు ఎడిటర్ కూడా. దీని ద్వారా మెరుగైన ఆర్యోగ్యానికి సంబంధించిన విషయాలు పంచుకుంటుంటారు. సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సినీ ప్రముఖుల లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లను తన ఫాలోవర్లకు పరిచయం చేస్తుంటారు.అయితే, ఉపాసన తాజాగా యోగా పాఠాలు నేర్పే ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అపోలో హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ ఆధ్వర్యంలో పోలీసులకు యోగాసనాలు నేర్పించారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలని చాటే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫాలోవర్లతో పంచుకున్నారు. తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆమె చెప్పారు. మానసిక, శారీరక ఒత్తిడిలోనూ ప్రజలకు సేవ చేస్తున్న తెలంగాణ పోలీసుల కోసం ఈ యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *