తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా అమలు చేస్తుందని ఆశిస్తున్నానని వెంకయ్య పేర్కొన్నారు.