విజయ్ దేవరకొండ వస్తున్నాడు నీరు వృధా చేయకండి

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న నీటి వృథాపై ప్రజలను చైతన్యం చేసేందుకు అర్జున్‌రెడ్డి సినిమా హీరో ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. విలువైన తాగునీటి వృథాను తగ్గించడం, స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు విజయ్‌ దేవరకొండ ముందుకు వచ్చారని జలమండలి ఎండీ దానకిషోర్‌ గురువారం తెలిపారు. ప్రస్తుతం నగరానికి సరఫరా చేస్తున్న నీటిలో ప్రతి రోజూ 10 శాతం అంటే దాదాపు 16 కోట్ల లీటర్లు నీరు వృథాగా పోతోందన్నారు. తక్షణం ఈ వృథాను తగ్గించి మరింత అందించేందుకు వీలుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా హీరో విజయ్‌ దేవరకొండ నీటి విలువును తెలిసేలా ప్రజలను చైతన్యం చేయనున్నారని, జలమండలి, జీహెచ్‌ఎంసీ చేపట్టే పలు కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం అవుతారన్నారు. నీటి సరఫరా సమయంలో ఎన్ని రకాలుగా నీటి వృథా అవుతుందో జలమండలి లైన్‌మేన్లు గుర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లైన్‌మైన్‌లతో ప్రమాణం చేయించారు. సాఫ్‌, షాన్‌దార్‌ హైదరాబాద్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాటర్‌ బోర్డు లైన్‌మేన్లలు ఇతర అధికారులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *