కోహ్లీ ఖాతాలో మరో రికార్డు …ఏబీని అధిగమించాడు

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. మూడో వన్డేలో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వన్డే కెప్టెన్‌గా అరుదైన గుర్తింపు పొందాడు.

ఈ మ్యాచ్ ద్వారా 17 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లి కెప్టెన్ వెయ్యి పరుగుల్ని సాధించి దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ని అధిగమించాడు. అంతక ముందు ఏబీ డివిలియర్స్ వన్డే కెప్టెన్ గా 18 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగుల్ని సాధించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ 20 పరుగులు చేయగానే వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ధోని గైర్హాజరీ సమయంలో 14 వన్డేలకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *