కోహ్లీ అరుదైన రికార్డ్
భారత జట్టు కెస్టెన్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు మ్యాచ్ ల్లో వెయ్యి పరుగుల సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ముంబయి వాంఖడె మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో విరాట్ ఒక క్యాలండర్ ఇయర్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో భారత జట్టు కెప్టెన్గా ఈ ఘనతను సాధించింది ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. 1997లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్, 2006లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ కూడా ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు.