తమిళనాట మరో సంచలన నిర్ణయం తీసుకున్న నటుడు విశాల్

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన సినీ నటుడు విశాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాట  ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని విశాల్ తీసుకున్న నిర్ణయం  తెలిసింది. దీనిని గతంలో నిర్మాతలు వ్యతిరేకించారు. దీనికి పరిష్కారం చూపిస్తామన్న విశాల్ వారికి సరికొత్త ఆదాయ మార్గం చూపించాడు. టీవీ చానళ్లకు తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు. సినిమాలకు సంబంధించిన పాటలు,ట్రైలర్లు,క్లిప్పింగ్‌లతో టీవీ చానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు దానిలో కొంత నిర్మాతలకు ఇవ్వడంలో తప్పు లేదని విశాల్ అభిప్రాయపడ్డాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *