పక్కా ప్రణాళితో ముందుకెళ్లాం: కేసీఆర్
హైదరాబాద్: విద్యుత్ కొరతను తెలంగాణ రాష్ట్రం అధిగమించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు తమ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని తెలిపారు.
బుధవారం ఆయన విద్యుత్ రంగంపై మాట్లాడుతూ ఈ సమస్యను దాటేందుకు తాము మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. త్వరలోనే విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు.