హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా తీర్చి దిద్దుతాం: KTR

జీహెచ్ఎంసీ భవనాల ట్రైబ్యునల్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇవాళ సభలో సభ్యులు బిల్లును ఆమోదించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా తీర్చి దిద్దుతామని అన్నారు. సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడానికి పైసా ఖర్చులేకుండా కట్టుకునే పరిస్థితి రావాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. అనధికార నిర్మాణాలకు కట్టడి చేసేందుకే ట్రైబ్యునల్ కాని వేరే ఉద్దేశ్యంలేదని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ తీర్పును హైకోర్టులో సవాలు చేయవచ్చని తెలిపారు. టౌన్‌ప్లానింగ్‌ను కూడా సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

టౌన్‌ప్లానింగ్‌లో 120 మందిని ఇప్పటికే నియమించామని, మరో 84 మందిని నియమిస్తామని సభలో తెలుపుతున్నానన్నారు. రోడ్ వైడెనింగ్ దీని పరిధిలోకి రాదన్నారు. మురికి వాడల వారిని ఒప్పించి 30 గజాలు, 20 గజాల ఇండ్లు ఉన్నవారిని కూడా ఒప్పించి ఇండ్లు కడదామని, మురికి వాడలు లేకుండా చేద్దామన్నారు. అర్బన్ డెవలప్‌మెంట్‌ను మొదట ఇక్కడ మొదలు పెట్టి తర్వాత ఇతర ప్రాంతాలకు తీసుకెళ్దామని పేర్కొన్నారు. తర్వాత బిల్లును ఆమోదిస్తూ సభ తీర్మానం చేసింది. స్పీకర్ బిల్లును సభ ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *