యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఉచితంగా లడ్డూలు ఇచ్చారు
యాదాద్రి టౌన్, ఫిబ్రవరి 2: రహదారి భద్రత నిబంధనలు పాటించిన వారికి యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఉచితంగా లడ్డూలు ఇచ్చారు. 31వ ‘రోడ్డు భద్రతా వారోత్సవాల్లో’ భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ పెట్టుకుని, సరైన ధ్రువపత్రాలతో వాహనాలపై క్షేత్ర సందర్శనకు వచ్చిన వారికి పోలీసులు నృసింహస్వామి లడ్డూ అందజేశారు.