ఎవరికి ఏ శాఖలు? మోదీని కలిసిన యోగి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మంత్రి వర్గ కేటాయింపులపై ఆయన మోదీతో మాట్లాడారు. మోదీ అజెండా ప్రకారమే తన పరిపాలన ఉంటుందని చెప్పిన యోగి పరిపాలన బాధ్యతలు చేపట్టిన తొలి రోజు అనంతరమే ఢిల్లీలో మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యోగి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీని, బీజేపీ చీఫ్ అమిత్ షాను, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కూడా కలవనున్నారు. మొత్తం 47మందిని తన మంత్రివర్గంలోకి ఆదిత్యనాథ్ తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి త్వరలోనే శాఖలను కేటాయించాల్సి ఉన్నందున ఎవరెవరికీ ఏయే శాఖలు కేటాయిస్తే బావుంటుందనే విషయాన్ని చర్చించేందుకు యోగి వారితో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.