నటి షబానా కోలుకుంటున్నారు … ప్రభుత్వటీచర్‌ను సస్పెండ్ చేసేశారు.

ప్రముఖ బాలీవుడ్ నటి షబానాజ్మీ కోద్ధి  రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. పుణె- ముంబై హైవేపై వేగంగా వెళుతున్న ఆమె కారు ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షాబానాకు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు వారిని హుటాహుటిన నవీ ముంబైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం కోకిలా బెన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు షబానా ఐసీయూలో ఉన్నారు. ఎందరో సినీ ప్రముఖులు షబానాను పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. షబానా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ షబానాపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ‘షబానా చస్తే బాగుండు’ అన్నది అని ఓ పోస్ట్ సారాంశం. షబానాకు ఆ టీచర్‌కు మధ్య ఏం విభేదాలు ఉన్నాయో తెలీదు కానీ ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసేశారు. ఎందుకు షబానా చావు కోరుకోవాలని అనుకుంటోందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం షబానా కోలుకుంటున్నారు. ఆమె ఐసీయూలోనే ఉన్నారు కానీ ఆరోగ్యం బాగానే ఉందని షబానా భర్త జావేద్ అక్తర్ తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *