భరత నాట్యం, అందాల పోటీల్లోనూ సుగమ్య శంకర్
ఆమె భరత నాట్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల పోటీల్లోనూ రాణిస్తున్నారు. మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు అవార్డులు లభించాయి. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన సుగమ్య శంకర్ యోగా గురువు రవిశంకర్ కూతురు. చిన్నప్పటి నుంచి చదువు, నాట్యంలో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలోని పండరీపురంలోని ప్రముఖ విద్యాలయంలో సుగమ్య డాన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ద్వారా మద్రాసు యూనివర్శిటీ లో భరత నాట్యంలో ఎం ఏ చదువుతున్నారు. దేశ విదేశాల్లో సుగమ్య భరత నాట్యం ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీ కళా, కళారత్న తదితర బిరుదులు వరించాయి. కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి.