అశ్విన్ హాఫ్ సెంచరీ – టీమిండియా ఆధిక్యం
రవిచందర్ అశ్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కోహ్లీ ఔటయిన తరువాత భారత బ్యాటింగ్ కుప్పకూలకుండా ఆచితూచి ఆడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అశ్విన్ 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో వైపు జడేజా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 271/6. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 12 పరుగులు వెనుకబడి ఉంది. మరో నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి.