భోదన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓ వింత ఘటన

నిజామాబాద్ జిల్లా భోదన్‌ మున్సిపాలిటి పరిధిలోని 32 వ వార్డులో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్తి ఇమ్రాన్‌ ముక్కును, వ్రేళ్లను కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలియాజ్‌ కొరికాడు. కాంగ్రెస్‌ అభ్యర్థులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని అయితే వారిని అడ్డుకున్నందుకే తనపై దాడి చేసారని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇలియాజ్‌ తన ముక్కు, వ్రేళ్లు కొరికాడని ఆరోపించాడు. ఇమ్రాన్‌కు రక్తస్రావం కావడంతో అతన్నిఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనను పోలీసులు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *