మహేష్ భార్య, రామ్ చరణ్ వైఫ్…. ముద్దాడిన ఆ వ్యక్తి ఎవరు?
టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో ఎప్పుడూ ఎక్కువగా వార్తల్లో ఉండేది, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది ఇద్దరే. అందులో ఒకరు మహేష్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన. ఈ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరికి వారే తమ ప్రొఫెషన్లలో దూసుకెలుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో గ్రూఫ్ డైరెక్టర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మహేష్ బాబు భార్య న్రమత చారిటీ కార్యక్రమాలు, ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు ఇంటి పనులు కూడా చక్కబెడుతూ బిజీ బిజీగా గడుపుతుంటారు
గత రాత్రి ఒక బర్త్ డే పార్టీ జరగ్గా.. అక్కడ ఉపాసన-నమ్రత కలసి దియా భూపాల్ అనే అమ్మాయికి ముద్దుపెట్టారు. ఈమె ఎవరో కాదు.. అప్పట్లో అఖిల్ పెళ్ళి చేసుకోవాలని డ్రాప్ అయిన శ్రీయ భూపాల్ ఉంది చూశారు.. ఆమెకు వదిన. శ్రీయ అన్నయ్య కృష్ణ భూపాల్ ముందుగా డెక్కన్ క్రానికల్ అధినేత కూతురు గాయత్రి రెడ్డిని పెళ్ళిచేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయ్ కు చెందిన జ్యూయలరీ డిజైనర్ కూతురు ధియా మెహతా ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నిన్న ఆ పిల్లల బర్త్ డే సందర్భంగా ఇలా ఉపాసన అండ్ నమ్రత అక్కడ దియాకు ఇలా ముద్దుపెట్టారు.
ఉపాసన ఫ్యామిలీకి, జివికె మరియు భూపాల్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ క్రమంలోనే దియాకు ఉపాసన చాలా క్లోజ్ అయింది. నమ్రత, ఉపాసన ప్రెండ్ కావడంతో దియా కూడా వీరి గర్ల్ గ్యాంగ్లో చేరిపోయింది.