సినీ నటుడు వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ సినీనటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. అనరిగ్యం కారణంగా సికింద్రాబాద్ యశోధా హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుడిశవాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీన హాస్పిటల్లో చేరాడు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్తితి మరింత విషమించడంతో ఐసియూ కు తరలించి వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం 12.21 గంటలకు మృతి చెందారని వెల్లడించారు.